ధర్మపురి : వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్లు (45) కొడుకు విష్ణువర్ధన్తో కలిసి మల్లన్నపేట చెరువు మత్తడి దాటుతుండగా కుంగడంతో నీటిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా.. తండ్రీకొడుకులు విగతజీవులై ఒడ్డుకు చేరారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ రవి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ మాధురి, డీఎస్పీ ప్రకాశ్, తహసీల్దార్ నవీన్కుమార్ ఉన్నారు.