అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తు జీవనం సాగిస్తున్న తండ్రి మహ్మద్౯75), కొడుకు హుసేన్(35) స్వగ్రామానికి కారులో బయలు దేరారు. ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టారు.
తండ్రి పింఛన్ కోసం స్వగ్రామం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోడుమూరు పీహెచ్సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.