న్యూఢిల్లీ: రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఈసారి 40 లక్షల ట్రాక్టర్లతో చలో పార్లమెంట్ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ సంక్షేమం కోసం కృషి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. రైతులతో చాలా సార్లు చర్చలు జరిపామని, వారు ఎదైనా అంశంపై చర్చించాలని భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.