ఆగ్రా (యూపీ), అక్టోబర్ 25: రైతుల పాలిట ఉరితాళ్లుగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఎవరూ ఓటు వేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని సంయుక్త్ కిసాన్ మోర్చా కూడా వ్యతిరేకిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అభ్యర్థులను నిలబెట్టబోమని, అలాగే ఏ పార్టీకి కూడా తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టంచేశారు. ఆగ్రా పోలీస్ కస్టడీలో చనిపోయిన రైతు అరుణ్ నర్వార్ కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.