లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఆశ కోల్పోవద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఎంత కాలం పోరాడినా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం జరిగిన కిసాన్ మహాపంచాయతీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టి వంద రోజులు దాటిందని అన్నారు. 100 వారాలు లేదా 100 నెలలు పట్టినా నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు రైతులతోపాటు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రియాంక తెలిపారు. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.