ఖమ్మం: నగర వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డీ లక్ష్మీప్రసన్నకు ఉద్యాన సాగు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఇల్లందు క్రాస్ రోడ్ రైతు బజార్ రైతులు ఆమెను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి పద్మావతి, రైతులు చైర్ పర్సన్కు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువతో సత్కరించారు.
అనంతరం రైతు బజార్లో నెలకొన్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకవచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు రామారావు, గిరి, ఉమేష్, వినోద్, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.