పెద్దపల్లి : రైతు వేదికలు అధ్యయన కేంద్రాలుగా మారాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, మైదంబండ, ముత్తారంలో నిర్మించిన రైతు వేదికలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడేడు గ్రామాల్లో మానేరు నదిపై నిర్మించే చెక్డ్యాంలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రైతులు వేదికలు దేశానికే ఆదర్శమన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చెక్డ్యాంల నిర్మాణంతో మంథని ప్రాంతం కోనసీమలా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.