ఆదిలాబాద్ : రైతు వేదికలు దేశానికే ఆదర్శమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు పంటల విషయంలో ఏ సమస్య వచ్చినా ఈ వేదికలో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారని సమస్యలు పరిష్కరించు కోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, జెట్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.