వికారాబాద్ : విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగుడుపల్లి అనుసంధానమైన ఎల్లామ్మగుట్ట తండాకు చెందిన రాంజీ నాయక్(45) ఏడు ఎకరాల పొలం కౌలుకు తీసుకోని వరి, జొన్న పంట సాగు చేస్తున్నాడు. అడవి జంతువుల బెడద ఎక్కువ కావడంతో కావలి కోసం రాత్రి పొలం వద్దకు వెళ్లి లైట్ వేసుకునే క్రమంలో కరెంట్ షాక్ తగిలి రాంజీ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. భార్య శుక్రబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.