సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల (Sircilla) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టన్నెల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రైతు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరో ఘటనలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అంతుల్వాయిలో కరెంట్షాక్తో మహిళ మృతిచెందింది.