జగిత్యాల: జిల్లాలోని వెల్దుర్తిలో విషాదం నెలకొంది. వెల్దుర్తిలో పంట వ్యర్ధాలు దహనం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తన పొలంలో వరి కొయ్యలను దహనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకున్నది. దీంతో ఊపిరాడక పోవడంతో లక్ష్మణ్ గౌడ్ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.