ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. సఫారీలతో సిరీస్ కోసం రెడీ అవుతోంది. కేరళలోని త్రివేండ్రం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది. ఈ క్రమంలో టీంను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. టీమిండియా బస్సును చుట్టుముట్టేశారు. ఈ సందర్భంగా అభిమానులంతా సంజూ శాంసన్ పేరుతో నినాదాలు చేశారు.
ఈ సమయంలో జరిగిన ఒక ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. అభిమానులు చేస్తున్న నినాదాలు విన్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన మొబైల్లో సంజూ శాంసన్ ఫొటోను ఫ్యాన్స్కు చూపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సఫారీ సిరీస్తోపాటు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా సంజూకు చోటుదక్కలేదు. అద్భుతమైన ఫాంలో ఉన్నప్పటికీ అతన్ని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
Suryakumar Yadav Showing SanjuSamson's Picture To fans😍 Indian cricket 🏏 Team have Reached Trivandrum Ahead Of 1st T20 Against SouthAfrica #IndianCricketTeam #INDvsSA #CricketTwitter #Cricket #SanjuSamson #INDvAUS #SuryakumarYadav #sky @CricCrazyJohns @rajasthanroyals pic.twitter.com/NUCyqjRSZ2
— Vaishnav Hareendran (@VaishnavHari11) September 26, 2022