సినీ తారలను దేవుళ్లుగా కొలిచే అభిమానులకు కొదవ లేదు. అదే బిగ్బీ వంటి తారలకు అలాంటి అభిమానులు బోలెడంతమంది ఉంటారు. వాళ్లలో ఒకరే అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే గోపీ సేథ్. అతని భార్య రింకూ కూడా బిగ్బీకి బిగ్గెస్ట్ ఫ్యానే. అందుకే వీళ్లిద్దరూ కలిసి తమ ఇంటి ముందు బిగ్బీ లైఫ్ సైజ్ విగ్రహం ఏర్పాటు చేశారు.
రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేసిన ఈ విగ్రహం కోసం సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేసిందీ జంట. ఈ విగ్రహావిష్కరణ సభలో చాలా మంది అమితాబ్ అభిమానులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత పెద్ద పార్టీ కూడా చేసుకున్నారు. 1990లో న్యూజెర్సీలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోపీని అమితాబ్ కలిశారు.
ఆయన ఎంత సామాన్యంగా ఉంటారో చూసిన గోపి.. బిగ్బీకి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ‘‘అమితాబ్ రీల్ లైఫే కాదు, రియల్ లైఫ్లోనూ నాకు ఆరాధ్య దైవం వంటి వారు. ఆయన మిగతా స్టార్స్లా కాదు. అభిమానులకు చాలా విలువనిస్తారు. ఎక్కడా తను స్టార్ననే అహం ఉండదు. చాలా నమ్రతగా ఉంటారు’’ అని గోపి చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకోగా అవి తెగ వైరల్ అవుతున్నాయి.
👆🏻👆🏻On Saturday august 27th we have placed @SrBachchan statue 👆🏻👆🏻👆🏻👆🏻at outside in the front of our new home in edison NJ USA . Lots of Mr Bachchan’s fan’s participated on Mr Bachchan’s staue inoguration ceremony. pic.twitter.com/O3RklFS5eZ
— Gopi EFamily (@GopiSheth) August 28, 2022