న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా కొత్త జెర్సీతో దర్శనమివ్వనుంది. భారత జట్టు కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ ఈ జెర్సీని రూపొందించింది. ‘మెన్ ఇన్ బ్లూ’ గుర్తింపును కొనసాగించే విధంగా ఉన్న రాయల్ బ్లూ జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు మూడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కోట్లాది మంది అభిమానుల నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించినట్లు బోర్డు పేర్కొంది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ అధికారిక ట్విట్టర్లో వివరాలు వెల్లడించింది. ఈనెల 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్కప్ జరుగనుండగా.. టీమ్ఇండియా తొలిపోరులో దాయాది పాకిస్థాన్తో (అక్టోబర్ 24) తలపడనున్న విషయం తెలిసిందే.