మంచిర్యాల : జిల్లాలో ఆకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించింది. కాగా, లక్షెట్టిపేట్ పట్టణ జాతీయ రహదారిపై, లక్షెట్టిపేట్ మండలం పరిధిలోని చందారం గ్రామానికి వెళ్లే రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం తెలుసుకున్న లక్షెట్టిపేట్ ఎస్ఐ చంద్ర శేఖర్ వెంటనే ఎక్స్ కవేటర్ తెప్పించి చెట్లను రోడ్డుపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయించారు.
విద్యుత్ సిబ్బంది హుటాహుటిన తేరుకుని విద్యుత్ స్తంభాలు సరి జేశారు. ప్రజలకు విద్యుత్ అంతరాయం కలుగకుండా కావాల్సిన చర్యలు చేపట్టారు. వెంటనే స్పందించిన ఎస్ఐ, విద్యుత్ సిబ్బందిని ప్రజలు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత