జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని గిరిదిహ్ ఎస్పీ అమిత్ రేణు తెలిపారు.
ఘటన జరిగిన తీరును బట్టి ఇంట్లో సిలిండర్ పేలి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.