అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివరిస్తానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం తిరుమలాపురంలో వరద బాధిత గ్రామాల్లో్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వరద నష్టానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం గ్రామస్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను కోరానని, ఈసారి భేటిలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చినందున ముంపు గ్రామాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీని,వరద నష్టాన్ని త్వరగా ఇవ్వాలని గట్టిగా కోరుతానని జగన్ వెల్లడించారు. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 10వేలు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా మని అన్నారు. వరద నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.