వరంగల్ : మంచి ఆరోగ్యానికి వ్యాయామమే మంచి మార్గమం. అన్ని సమస్యలకు అదే అసలైన మందు అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆదివారం అజరా హాస్పిటల్స్ అధ్వర్యంలో భద్రకాళి బండ్ నుంచి జే ఎన్ ఎస్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.
అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశంలో నడక ద్వారా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్ రాజ్, హాస్పిటల్ సిబ్బంది, పాల్గొన్నారు.