నిజామాబాద్ : జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పాత భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం తెలిసిన గ్రామస్థులు పాతభవనం వద్దకు చేరుకుని తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిలో ముగ్గురిని బంధించారు. వారిని పోలీసులకు అప్పగించారు.