హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. తనిఖీలకు ఇన్స్పెక్టర్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఫోన్ కు మెసేజ్ పంపనున్నది.
ఆరు గంటల్లోపు అం గీకారం లేదా తిరస్కారంపై సమాచారం ఇవ్వా లి. అంగీకరించిన అధికారులకు ఏ తేదీన ఏ ప్రాంతానికి వెళ్లాలో చెప్తారు. తనిఖీ కోసం ఏ కాలేజీకి వెళ్లాలో మూడు గంటల ముందుగానే తెలియజేస్తారు. తనిఖీల తర్వాత సమగ్ర నివేదికను రూపొందించాలి. ఒక కాపీని కాలేజీ యా జమాన్యానికి ఇవ్వాలి. ప్రత్యేకంగా గుర్తించిన అంశాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయాలి.