ముంబై : కుల ధ్రువీకరణపత్రం కేసులో ఎన్సీబీ మాజీ ముంబై అధికారి సమీర్ వాంఖడేకు నిజ నిర్ధరణ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. సమీర్ కుల ధ్రవీకరణపత్రాన్ని సమర్థించింది. ఆయన హిందువు కాదు ముస్లిం అని వచ్చిన ఫిర్యాదు విచారించిన కమిటీ.. ఈ మేరకు 91 పేజీల రిపోర్ట్ను అందించింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని స్పష్టం చేసింది.
సమీర్ వాంఖడే, ఆయన తండ్రి ద్యానేశ్వర్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించలేదని, ముస్లిం మతాన్ని స్వీకరించలేదని చెప్పింది. సమీర్ వాంఖడే, ఆయన తండ్రి హిందూ మతంలో గుర్తించిన మహర్-37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని కమిటీ ఉత్తర్వులోఓ్ల పేర్కొంది. ఈ విషయంపై సమీర్ వాంఖడే స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు.
‘నా జీవితమంతా సమాజ సేవకే పని చేశాను. కానీ, కొందరు నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాతో పాటు కుటుంబం, చివరకు చనిపోయిన నా తల్లిని విడిచిపెట్టకపోవడం నాకు బాధ కలిగించింది’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సమీర్ వాంఖడే కులం సర్టిఫికెట్పై ఫిర్యాదు చేసిన మహారాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, మనోజ్సంసారే, అశోక్ కాంబ్లే తదితరులు తమ వాదనకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని కమిటీ పేర్కొంది.