హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో పనిచేసేవారంతా సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవవర్ధన్ పిలుపునిచ్చారు. ఈ దిశగా సిబ్బంది అందరికీ అధికారులు మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం బస్భవన్లో మేధోమథన సదస్సు నిర్వహించారు. దసరా సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ అద్భుత సేవలందించిందని రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ప్రశంసించారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీని లాభాల బాటలోకి తేచ్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. సంస్థను మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను కోరారు.