అమరావతి : సినీ రంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాల వారిని చర్చలకు పిలువాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. నిన్న సీఎం జగన్ చిత్రసీమ పరిష్కారానికి చూపిన మార్గం సక్రమంగా లేదని ఆరోపించారు. సినీ రంగంలోని అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
సినీ పరిశ్రమ మాదిరిగానే ఇతర అంశాలపైనా సీఎం దృష్టిని సారించాలన్నారు. 787 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. సినీ హీరోలను పిలిచి మాట్లాడినట్లే రైతులను ఆహ్వానించవచ్చు కదా అని వెల్లడించారు. ఇసుక, యూరియా కొరతపై సీఎం ఏ చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు.