భూపాలపల్లి రూరల్, ఆగ స్టు 14: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం రాత్రి సందర్శించారు. పాఠశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి బుర్ర సునీత, పాఠశాల ప్రిన్సిపల్ రజితను అభినందించారు.
ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల చరిత్ర ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. చదువుకునే దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని, ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని సూచించారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించిన ఆయన ఆదివారం ఉదయం విద్యార్థులకు సోప్ కిట్లను పంపిణీ చేశారు. కలిసి ఎమ్మెల్యే రన్నింగ్, యోగా, నమాజ్ చేశారు. వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బుర్ర రమేశ్ ఉన్నారు.