తిరుపతి, జూలై : టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జెఈఓ సదా భార్గవి సూచించారు. మొక్క నాటడమే కాకుండా అది పెరిగి చెట్టు అయ్యే దాకా దాని సంరక్షణ బాధ్యత కూడా వారే తీసుకోవాలని ఆమె అన్నారు. అటవీ విభాగం అధికారులతో మాట్లాడి మొక్కలు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు.