కైరో: వారం రోజులుగా సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కొని ట్రాఫిక్ జామ్కు కారణమైన ఎవర్ గివెన్ నౌకను విజయవంతంగా తిరిగి సరైన దిశలోకి తీసుకొచ్చారు. 400 మీటర్ల ఈ నౌకను 80 శాతం మేర సరైన దిశలోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి కదలడం ప్రారంభించిన నౌక.. ఆరు రోజుల తర్వాత తిరిగి తన దిశలోకి వచ్చి ఇంజిన్లను ప్రారంభించడం విశేషం. షిప్ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ నౌకను పంపించే ప్రక్రియ ఇంకా పూర్తిగా ముగియలేదని, అది అంత సులువు కాదని ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సంస్థ హెడ్ అన్నారు. వారం రోజులుగా కాలువకు అడ్డంగా ఉండటంతో వందలాది బోట్లతో సుయెజ్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరికొన్ని గంటల్లోనే ఈ షిప్ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ టీమ్తో చేరిన పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
నాకు పాస్పోర్ట్ ఇస్తే దేశ భద్రతకు ఎలా ముప్పు: మెహబూబా ముఫ్తీ