అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. 92.36 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు. గత నెల 22 న జేఎన్టీయూ – కాకినాడ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఉదయం 18,318 మంది విద్యార్థులకు గాను 17,180 మంది హాజరుకాగా, మధ్యాహ్నం 20,423 మందికిగాను 19,238 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 94 శాతం హాజరు నమోదైందన్నారు.