మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హజ్రత్ భాగ్మార్ సాబ్ దర్గా వద్ద రూ. 25 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం అన్ని మతాలు, వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిథ్యం ఇస్తుందని, ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలని కోరారు. ప్రత్యేకించి జిల్లాలో దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.