నల్లగొండ : జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం.నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని ,ఈ రోజు 12 వ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు.
కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్.డి.ఓ., ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫిసర్ రోహిత్ సింగ్ కు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డి.టి.విజయ్ లకు 15 వేల రూ.ల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. అట్టి అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు.
నల్లగొండ : జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం. లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని ,ఈ రోజు 12 వ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్.డి.ఓ., ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫిసర్ రోహిత్ సింగ్ కు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డి.టి.విజయ్ లకు 15 వేల రూ.ల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు.
అట్టి అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు.