వనస్థలిపురం, ఆగస్టు 31 : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీకి చెందిన మంగమ్మ తీవ్ర కడుపునొప్పితో దవాఖానలో చేరింది. ఆర్థిక స్థోమత సరిపోకపోవడంతో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరకాస్తు చేసుకుంది.
దీంతో ఆమెకు రూ.60వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. పనుల వత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కరోనా ప్రమాదం పొంచి ఉందని కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, నవీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.