హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తున్నారు. వారి ఆరోగ్యం, భద్రత కోసం కూడా అనేక చర్యలు చేపడుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
జాతీయ బాలల దినోత్సవం అత్యంత ఘనంగా ఆదివారం రవీంద్ర భారతిలో జరిగింది.
చిన్నారుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగింది.
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం మంత్రి సత్యవతి మాట్లాడుతూ..గత ఏడాది కరోనా వల్ల ఈ ఉత్సవం సరిగా జరుపుకొలేదు.
వచ్చే ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయిలో మంచి ప్రణాళికతో బ్రహ్మాండంగా వారం రోజుల పాటు నిర్వహించుకుందాంమన్నారు. పిల్లలు ఆటపాటలతో సంతోషంగ ఉండాలన్నారు.
సమాజంలో కూడా కొంత మార్పు రావాలి. దురదృష్టం కొద్ది తల్లిదండ్రులను కోల్పోతే..కొంతమంది అకారణంగా ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఇక్కడకు వచ్చిన వారు అనాథలుగా భావించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కొవిడ్ సమయంలో అంగన్వాడీలు చేసిన సేవలు చూసి కేంద్రం అవార్డులు ఇచ్చింది. అందుకే సీఎం కేసీఆర్ గారు కూడా వేతనాలు పెంచారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య పరీక్షలు, పౌష్ఠికాహారం అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధించుకుంటున్నామని మంత్రి తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణలో అనాథ పిల్లలుగా ఉండకూడదని ప్రభుత్వమే తల్లి దండ్రులుగా వారికి రక్షణ కవచంగా ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు. త్వరలో ఈ నిర్ణయం అమలు కానుందని మంత్రి తలసాని తెలిపారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. పిల్లలు కూడా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ఉపయోగించుకుని గొప్ప స్థాయికి రావాలి. దేశానికి ఆదర్శంగా ఎదగాలన్నారు.
శిశు సంక్షేమ శాఖకు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక తల్లిగా ఉండడం కూడా గొప్ప విషయం అన్నారు.అనంతరం ప్రతిభ కలిగిన పిల్లలను, సిబ్బందిని మంత్రులు జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, సభ్యులు రాగజ్యోతి, అపర్ణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి