లండన్: రనౌట్ వివాదానికి కేంద్ర బిందువైన ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లెట్ డీన్ ఇకపై తాను క్రీజులోనే ఉంటానని, బౌలర్ బంతిని వేసేవరకు క్రీజ్ను వదలనని వెల్లడించింది. భారత్తో జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ డీన్ను మన్కడింగ్ చేయడంతో దీనిపై దుమారం రేగింది.
కొందరు దీప్తి శర్మను విమర్శిస్తే, మరికొందరు అంతా నిబంధనలకు లోబడే జరిగిందని ఆమెకు మద్దతు పలికారు. స్వదేశానికి వచ్చిన తర్వాత దీప్తి శర్మ తాను పలుమార్లు డీన్ను హెచ్చరించానని చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో రనౌట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.