భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన స్లోబాల్ను ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్.. దాన్ని సరిగా అంచనా వేయలేక వికెట్ల మీదకు ఆడుకున్నాడు.
ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని డ్రైవ్ చేయడంలో బట్లర్ విఫలమయ్యాడు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దాంతో 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. బట్లర్ అవుటవడంతో డేవిడ్ మలాన్ క్రీజులోకి వచ్చాడు.