తెలుగు రాష్ట్రాల్లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ షాపుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20 గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ముసద్దీలాల్ బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే షోరూంలోని బంగారం మొత్తాన్ని కూడా లెక్కిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.