కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు సినీ రంగం (Telugu Industry)లో కూడా భారీ మార్పులు తీసుకొచ్చింది. కరోనా సమయంలో థియేటర్లో సినిమాలు విడుదల చేయలేని నిర్మాతలు ఓటీటీలో నేరుగా సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. దాంతో ప్రేక్షకులు ఓటీటీ సినిమాలకు అలవాటు పడ్డారు. భాషపరిమితులు లేకుండా ఓటీటీల్లో అన్ని భాషల సినిమాలు చూడటం ప్రారంభించారు.
ఇక కరోనా ప్రభావం (Covid Pandemic) తగ్గిన తరువాత విడుదలైన ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అయితే ఆ తరువాత విడుదలైన సినిమాలు థియేటర్కు జనాలను రప్పించలేకపోవడంతో టాలీవుడ్ నిర్మాతలు అయోమయంలో పడ్డారు. థియేటర్లకు జనాలు రావడం లేదు.. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి..ఖర్చు తగ్గించుకోవాలి. ముఖ్యంగా నటీనటులు, దర్శకుల పారితోషికాలు తగ్గించాలి..అంటూ టాలీవుడ్లో గత 15 రోజులుగా షూటింగ్లు బంద్ (Tollywood Strike) చేసుకోని స్ట్రయిక్ చేస్తున్నారు.
అయితే ఇది కేవలం తెలుగు సినిమాల (Telugu cinema)కు మాత్రమే వర్తింపు. ఎందుకంటే తెలుగు, తమిళంలో సినిమాలు చేసే నిర్మాతలు.. మేము తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నాం అనే సాకుతో షూటింగ్లు చేస్తుండటం కొసమెరుపు. ఈ బంద్ మొదలైన తరువాత కంటెంట్ వున్న సినిమాలు బింబిసార, ప్రేమమ్, కార్తికేయ -2 చిత్రాలు విడుదల కావడం జనాలు థియేటర్లకు రావడం.
చాలా రోజుల తరువాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు కంటెంట్ వుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అని మరోసారి ప్రూవ్ చేశాయి. అంతేకాదు ఇందులో కార్తికేయ-2 (Karthikeya 2) చిత్రం బాలీవుడ్లో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది..సో.. జనాలు థియేటర్లకు రావడం లేదని స్ట్రయిక్ మొదలుపెట్టిన టాలీవుడ్ నిర్మాతలు తమ అంచనాలు తప్పు అని భావిస్తున్నారని..అతి త్వరలోనే స్ట్రయిక్కు మంగళం పాడే దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం.