శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్బెరన్ – తార్సర్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు. అయితే, మృతులు ఏ సంస్థకు చెందిన గుర్తించలేదని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.