హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రమేనని స్పష్టం చేశారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది నుంచి బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని లేఖలో పేర్కొన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు నుంచి బేసిన్ ఆవలికి నీటి తరలింపుతో బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయన్నారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని.. 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమన్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ ఆవలికి మళ్లీస్తాయని.. కాబట్టి కేటాయింపులు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్ఎన్ప్రాజెక్టు ద్వారా టీబీహెచ్సీఎల్ ప్రాజెక్టు కంటే ఆవలకు తీసుకుని వెళ్లడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమన్నారు. మిగులజలాలపై బేసిన్ ఆవలకు తీసుకెళ్లే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంటే.. ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును 3850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమన్నారు.