న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వెలువడుతున్న కాలుష్యం భారత్లోనే అత్యధికమని తాజా సర్వే వెల్లడించింది. 2015-20 మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ తరహా ఉద్గారాల్లో భారత్ వాటా 12.2 శాతమని తెలిపింది. ఐఐటీ పూర్వ విద్యార్థులు నెలకొల్పిన ‘బ్లూ స్కై అనలిటిక్స్’ అనే వాతావరణ అధ్యయన సంస్థ ఈ సర్వే నిర్వహించింది. 2016-19 మధ్య కాలంలో భారత్లో జీహెచ్జీ ఉద్గారాలు తగ్గాయని, మళ్లీ 2019-20లో పెరిగాయని సర్వే వివరించింది.