హైదరాబాద్, సెప్టెంబర్ 28: బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో రిటైల్ ఎలక్ట్రానిక్ స్టోర్లను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఐపీవోకి రాబోతున్నది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న షేర్ల విక్రయం అదే నెల 7న ముగియనున్నది.
షేరు ధరల శ్రేణిని రూ.56-59 స్థాయిలో నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.500 కోట్లు సేకరించాలనుకుంటుంది సంస్థ. ఈ నిధులను వ్యాపార విస్తరణకోసం, రుణాలను తగ్గించుకోవడానికి వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.