వాషింగ్టన్, సెప్టెంబర్ 29: నిన్నటి దాకా ఎలక్ట్రిక్ బైక్లు.. ఎలక్ట్రిక్ కార్లు.. ఇప్పుడు ఇక ఎలక్ట్రిక్ విమానాల వంతు వచ్చేసింది. శిలాజ ఇంధనాల అవసరం లేకుండానే కరెంటుతోనే నడిచే విమానాలు వచ్చేశాయి. ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్తుతో నడిచే విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ తయారుచేసిన ఈ విమానం వాషింగ్టన్లోని గ్రాంట్ కౌంటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది.
దాదాపు 8 నిమిషాల పాటు ఈ విమానం గాలిలో ప్రయాణించింది. మొట్టమొదటి ఉద్గారాల రహిత విమానాన్ని విజయవంతంగా నడిపించామని ఏవియేషన్ సంస్థ అధ్యక్షుడు, సీఈవో గ్రెగోరీ డేవిస్ తెలిపారు. కాగా, అమెరికాకు చెందిన కేప్ ఎయిర్ 75 యూనిట్లు, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్లైన్స్ 50 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చాయి. మూడు వేరియంట్లు 9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈ కార్గోను ఏవియేషన్ కంపెనీ తయారుచేసింది.
ఆలిస్ విశేషాలు
అత్యధిక ఆపరేటింగ్ స్పీడ్ – 260 నాట్స్
ప్రయాణ దూరం – 150 మైళ్ల నుంచి 250 మైళ్లు
మోసే బరువు – 1,134 కిలోలు (ప్రయాణికుల విమానం) 1,179 కిలోలు (కార్గో విమానం)