లక్నో, జూలై 13: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే యజమాని ప్రాణాలు బలిగొన్నది. ఈ ఘటన యూపీలోని లక్నోలో మంగళవారం చోటుచేసుకున్నది. పిట్ బుల్ జాతికి చెందిన కుక్క 80 ఏండ్ల వృద్ధురాలిపై గంటకు పైగా విపరీతంగా దాడికి పాల్పడింది. పొట్టతో పాటు ముఖంపై తీవ్రంగా గాయాలు చేసింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని గుర్తించిన కుమారుడు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా, ప్రమాదకరమైన పిట్బుల్ కుక్క జాతిని కెనడా, బ్రిటన్ నిషేధించింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్తో పాటు పలు దేశాల్లో ఈ జాతి కుక్కలను పెంచుకోవడంపై కఠిన గైడ్లైన్స్ ఉన్నాయి.