అహ్మదాబాద్ : వృద్ధ దంపతుల గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన అహ్మదాబాద్లోని రన్నాపార్క్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. బాధితులను వారి ఫ్లాట్లోనే విగతజీవులుగా పడిఉండటం గుర్తించారు. హత్యకు గురైన దంపతులను దయానంద్ సంభర్ (90), విజయలక్ష్మి సంభర్ (80)గా గుర్తించారు. వృద్ధ దంపతులను రక్తపు మడుగులో చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దయానంద్ బెడ్పై విగతజీవిగా పడిఉండగా, ఆయన భార్య కుర్చీలో కుప్పకూలారు. నిందితులు వీరి గొంతుకోసిన ఆనవాళ్లున్నాయి. పదునైన ఆయుధంతో వారిపై దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇది దోపిడీ దొంగల పని అయిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.