పెండ్లిరోజు నాడే దంపతుల దుర్మరణం
గుడికి వెళ్లి వస్తుండగా చెట్టును ఢీకొన్న కారు
జన్నారం, మార్చి 9: రోడ్డు ప్రమా దంలో దంపతులు దుర్మరణం చెందారు. పెండ్లిరోజు కావడంతో గుడికి వెళ్లి వస్తుం డగా దుర్ఘటన చేసుకొన్నది. ఈ ఘటన బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో చోటు చేసుకొన్నది. లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్, ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మురిమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శోభారాణి (60), మాజీ సర్పంచ్ మురళీధర్రెడ్డి (65) దంపతులు. బుధవారం వారి పెండ్లి రోజు కావడంతో ఇందన్పల్లి సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసిన అనంతరం తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. ఇందన్పల్లి శివారులోని అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి ప్రధాన రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.