Uddhav Thackeray | మహారాష్ట్ర సీఎంగా రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నోరు విప్పారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు తిరుగుబాటు చేసి తనను వెన్నుపోటు పొడిచారని మంగళవారం శివసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
తాను పార్టీ బాధ్యతలు అప్పగించిన షిండే తనకు వెన్నుపోటు పొడిస్తే.. ఎన్సీపీ, కాంగ్రెస్ తమతోనే ఉన్నాయని ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. శివసైనికుల వల్ల విజయం సాధించి, అన్ని ప్రతిఫలాలు పొందినవారు (ఎమ్మెల్యేలు, మంత్రులు) తనను వదిలి పెట్టారు అని మీడియాతో అన్నారు. గత నెలలో ఏక్నాథ్ షిండే సారధ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ మైనారిటీలో పడింది.
మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ముందుగానే ఉద్ధవ్ ఠాక్రే.. సీఎంగా రాజీనామా చేశారు. తదుపరి శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.