హైదరాబాద్ : పేకాట ఆడుతున్న పలువురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ అబిడ్స్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక సంతోష్ దాబాపై పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ దాబా, మయూర్ పాన్షాప్ యజమానులతో పాటు పేకాట ఆడుతున్న మరో ఆరుగురు వ్యాపారవేత్తలను అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.73,860 నగదు, పలు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.