కైరో: సూయజ్ కాలువలో దాదాపు ఆరు రోజుల పాటు ఎవర్ గివెన్ ఓడ నిలిచిపోయినందుకు ఓడ యాజమాన్యం నుంచి నష్ట పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ సంకేతాలిచ్చింది. గత నెల 23వ తేదీన సూయెజ్ కాలువలో స్తంభించిన ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల తర్వాత ముందుకు కదిలిన సంగతి తెలిసిందే. ఈ ఓడ జపాన్కు చెందిన షై కిసేన్ కైషా సంస్థకు చెందింది.
వారం పాటు సూయెజ్ కాలువలో వాణిజ్య నౌకలు తిరుగనందుకు షై కిసేన్ కైషా సంస్థ నుంచి సుమారు 1000 కోట్ల డాలర్ల పరిహారం కోరనున్నట్లు ఈజిప్ట్ తెలిపింది. నౌకల రవాణా ఫీజు, జలమార్గానికి డ్యామేజీ, ఎవర్ గివెన్ నౌకను కదిలించడానికి సిబ్బంది ఖర్చు తదితరాలన్నీ కలిపి అంచనా వేసినట్లు సూయెజ్ కెనాల్ అథారిటీ సీఈవో ఒసామా రాబీ చెప్పారు.
అయితే ఎవరు పరిహారం అడుగుతారన్న సంగతి మాత్రం ఒసామా రాబీ తెలిపారు. పరిహారం వసూలు చేయడం ఈజిప్ట్ హక్కు అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఈజిప్ట్ రిప్యూటేషన్ను దెబ్బ తీసిందని, దానివల్ల జరిగిన నష్టాన్ని పొందాల్సిందే కదా అని అభిప్రాయ పడ్డారు.
తైవాన్లోని ఎవర్ గ్రీన్ మ్యారిన్ కార్పొరేషన్ స్పందిస్తూ సూయెజ్ కాలువలో రవాణా నౌకలు స్తంభించడానికి తమకు సంబంధం లేదన్నారు. అయితే, పరిహారం చెల్లించమని తమను అడిగే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఎరిక్ హ్సై వ్యాఖ్యానించారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు