ఖమ్మం : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా గురువారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు బండి గోపి జడ్పీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనతరం ఎర్రుపాలెం మండలంలోని మామునూరులో శీలం వెంకటేశ్వర్లు, మన్నెం నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 150 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వారికి కూడా కమల్రాజు గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్శితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.