మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 5: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా, సాహిత్యవేత్త జలజం సత్యనారాయణ (82) గురువారం కన్ను మూశారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. విద్యారంగంపై మమకారంతో లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ను, న్యూవిజన్ జూనియర్ కళాశాలను స్థాపించారు. పలు హిందీ, ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. జలజం మృతిపట్ల మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్ సంతాపం ప్రకటించారు.