పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, సెప్టెంబర్ 7: సరస్వతీనిలయం తెలంగాణ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం స్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఐదు మండలాల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు విద్యారంగంలో ఎంతో ముందున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకుని వచ్చి నాణ్యమైన విద్యను బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టి ఉత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి చదవాలి, ప్రయోజకుడు కావాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. తల్లిదండ్రులు పుట్టుకను ఇస్తే-గురువులు విద్యను అందజేసి లోకాన్ని చూపుతారన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్దగా, గొప్పగా నిర్వహిస్తారని కొనియాడారు. పటాన్చెరును ఎడ్యుకేషనల్ హబ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎడ్యుకేషనల్ హబ్
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే పటాన్చెరులో ఎడ్యుకేషనల్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరులో కేజీ టు పీజీ వరకు ఉచితంగా విద్యను అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కోరిన ప్రతి మౌలిక వసతులను కల్పించామన్నారు. సీఎస్సార్ ఫండ్స్తోనూ అనేక స్కూల్స్ బాగు చేసుకున్నామన్నారు. ‘మనఊరు-మనబడి’తోనూ అనేక స్కూల్స్ బాగుపడ్డాయన్నారు. ఉపాధ్యాయులంటే తనకు అధిక గౌరవమని, నాటి గురువులు అక్షరాలు నేర్పడంతోనే తాను ఈ మేరకు ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు అధికంగా ఉన్న నియోజకవర్గం తనదేనని ఎమ్మెల్యే అన్నారు. చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లలు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండేలా శిక్షణలుండాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల, అమీన్ఫూర్, రామచంద్రాపురం మండలాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్న శంకర్బాబు, సముద్రాల శ్రీదేవిని సన్మానించి గౌరవించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానందం, ప్రవీణ విజయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు కరణ్, సుజాత, ఎంపీడీవోలు బన్సీలాల్, మల్లేశ్వర్, ఎంఈవోలు పీపీ రాథోడ్, జెమిని, అమీన్పూర్ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్, కొల్లూరు మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు చంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, ఐకేపీ శ్రీనివాస్, మెరాజ్ఖాన్, గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్, నీనాచంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.