సుల్తాన్బజార్, ఆగస్టు 13 : ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. తమకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది ? కేటగిరి వారీగా ర్యాంకు కటాఫ్ ఎంత ? ఏ కోర్సులో చేరితే మేలు ? భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ? ఆయా కాలేజీల్లో అందిస్తున్న కోర్సులు ? క్యాంపస్ ప్లేస్మెంట్లు తదితర వాటిపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ‘టీన్యూస్’ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో ‘అపెక్స్ తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ శనివారం ప్రారంభమైంది.
మూడురోజలపాటు జరిగే ఈ ఫెయిర్లో ఉన్నత విద్యానిపుణులు, అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. నగరంలోని ప్రధాన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి తమ కళాశాల వాతావరణంతోపాటు బోధన, ప్లేస్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. సదస్సుకు వచ్చిన కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.
టీన్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ప్రసంగిస్తున్న మంత్రి సబితారెడ్డి, హాజరైన విద్యా నిపుణులు
సీఎస్ఈ తీసుకోవాలనుకుంటున్నా..
ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. కౌన్సెలింగ్ కోసం చూస్తున్నా. ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలో తెలుసుకునేందుకు ఎడ్యుకేషన్ ఫెయిర్కు వచ్చిన. ఎంసెట్లో వచ్చిన ర్యాంకుతో ఏ కళాశాలలో సీటు వస్తుందో చక్కగా తెలుసుకున్నా. బీటెక్లో సీఎస్ఈ తీసుకోవాలనుకుంటున్నా.
–ఉదయశ్రీ, ఈసీఐఎల్
అన్ని కళాశాలలు ఒకే వేదికపై
ఎడ్యుకేషన్ ఫెయిర్లో అన్ని మెడికల్,ఇంజినీరింగ్ కళాశాలలు ఒకే వేదికపై ఉండడంతో తమకు నచ్చిన కళాశాలను ఎంచుకునేందుకు సులువుగా ఉంది. ఎంసెట్లో 45వ ర్యాంకు వచ్చింది. ఫెయిర్లో పాల్గొనేందుకు యాదాద్రి జిల్లా నుంచి వచ్చాను.
–వర్షిత, విద్యార్థి
బోధన ఎలా ఉంటదో తెలుసుకున్నా..
కళాశాల వాతావరణంతోపాటు బోధన ఎలా జరుగుతుందో ఈ ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చు. మంచి కళాశాలను ఎంపిక చేసుకునేందుకు ఇలాంటి ఫెయిర్లు దోహదం చేస్తాయి. అపెక్స్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– అభినవ్, నాగోలు
అవగాహన కల్పించారు
ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఈ ఫెయిర్ ఎంతో దోహ దం చేస్తుంది. ఎంసెట్లో ర్యాంకు ఆధారంగా కళాశాలను ఎలా ఎంపిక చేసుకోవాలో చక్కగా వివరించారు. స్టాళ్ల నిర్వాహకుల అవగాహన చాలా బాగుంది.
– మహ్మద్ అబ్దుల్ ఖాలెద్, మెహిదీపట్నం
చాలా సులభమైంది..
ఇంటర్ అనంతరం ఏయే కోర్సుల్లో చేరాలి..కళాశాలను ఎంచుకోవడం సులభమైంది. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఈ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని కళాశాల స్టాళ్లు ఒకే వేదికపై ఉండటం ఆనందంగా ఉంది.
– సునీత, విద్యార్థి తల్లి, ఈసీఐఎల్
ఎంతో బాగుంది..
ఎంసెట్ ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ఏ కోర్సు తీసుకోవాలి. ఏ కళాశాలలో చేర్చాలో సందిగ్ధం ఉన్న తన లాంటి తండ్రులకు ఈ ఫెయిర్ దోహదం చేస్తుంది. అన్ని కళాశాలలను ఒకే వేదికపై తీసుకరావడం అభినందనీయం.
– వెంకటేశ్వర్లు, నాగోల్
3 ఏండ్లుగా స్టాల్ ఏర్పాటు
విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో బోధన అందించడమే లక్ష్యం. నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన చేస్తూ కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ కల్పిస్తున్నాం.
– కొమురయ్య, చైర్మన్, పల్లవి ఇంజినీరింగ్ కళాశాల
బోధన, ప్లేస్మెంట్ ముఖ్యం
8 ఏండ్లుగా అపెక్స్ ఫెయిర్లో స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం. కళాశాలలో అడ్మిషన్, ప్లేస్మెంట్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. క్రమశిక్షణతో బోధనతోపాటు 100 శాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నాం.
– కేతినేని వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్, ఎంఎల్ఆర్ కళాశాల
మిగతా కోర్సుల్లోనూ ఉపాధి
కళాశాల వాతావరణం ఎలా ఉంది? అక్కడ బోధ న ఎలా ఉందో తెలుసుకోవాలి. క్యాంపస్ వాతావరణం ప్రశాంతంగా ఉంటే ప్లేస్మెంట్ అధికంగా ఉంటుంది. అందరూ బీటెక్ సీఎస్ఈనే కావాలనుకోవడం కరెక్ట్ కాదు. మిగతా కోర్సుల్లో కూడా ఉపాధి అవకాశాలున్నాయి.
– వెంకటేశ్వర్రావు, శ్రీ సింధు కాలేజీ